ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విశాఖకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం గవర్నర్ విశాఖ చేరుకున్నారు. ఎయిర్పోర్టులో గవర్నర్ హరిచందన్కు కలెక్టర్ వి.వినయ్చంద్, సీపీ మీనాలు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఇవాళ పలు కార్యక్రమాలకు గవర్నర్ హాజరుకానున్నారు. తూర్పు నౌకాదళ కార్యాలయానికి వెళ్లనున్నారు. కైలాసగిరి, తెలుగు మ్యూజియం, సెంట్రల్ పార్కు సందర్శించనున్నారు. రేపు ఏయూను సందర్శించి వీసీతో గవర్నర్ భేటీకానున్నారు. అనంతరం విశాఖ పోర్టు ట్రస్ట్ను సందర్శించనున్నారు.