గుంటూరు జిల్లా పొనుగుపాడులో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునుడు, మద్దాల గిరిధర్, జీవీ ఆంజనేయులు, శ్రావణ్కుమార్లను పోలీసులు అరెస్ట్ చేసి నరసరావుపేటలోని శివ అతిథిగృహానికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించారని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ పొనుగుపాడుకు నిజనిర్ధారణ కమిటీని పంపింది. దీంతో అక్కడికి వెళ్లిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ గ్రామం వెలుపల ఆపేశారు