గన్నవరం విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తనిఖీ చేయడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. బాబును తనిఖీ చేయడం అధికార విధుల్లో భాగమేనని స్పష్టం చేశారు. దేశంలో చాలామంది ప్రతిపక్ష నేతలున్నారని.. వారినీ తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు తనిఖీల వ్యవహారాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్న బొత్స.. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనకు రక్షణను తొలగించారని గుర్తు చేశారు. రక్షణ ఎందుకు తొలగించారని అడిగితే మీకు అంత రక్షణ అవసరం లేదన్నారని ఆయన చెప్పారు.