ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఐ అదృశ్యంపై కొనసాగుతున్న ఆపరేషన్

national |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2019, 02:28 PM

కోచి : సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అదృశ్యమైన ఘటన కేరళలో వెలుగుచూసింది. ఎర్నాకులం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వీఎస్ నవాస్ రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయాడని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే సీఐ వీఎస్ నవాస్‌కు అతని పై అధికారి ఎర్నాకులం అసిస్టెంట్ కమిషనర్ పీఎస్ సురేశ్‌కు ఆఫీసు విషయానికి సంబంధించి బుదవారం గొడవ జరిగింది. అయితే సీఐ వీఎస్ నవాస్‌కు పీఎస్ సురేశ్ అదే రోజు రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి గొడవకు సంబంధించి తనకు వివరణ ఇవ్వాలని అడిగాడు. గురువారం రోజు సీఐ నవాస్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లలేదు. ఇంట్లో కూడా లేకపోవడంతో అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. సెక్షన్ 57 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సీఐ ఆచూకీ కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com