ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతుందని బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. భారత స్వాతంత్య్ర శత వార్షిక సంవత్సరమైన 2047 వరకూ బిజెపి అధికారంలో కొనసాగుతుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగిందని, 1950నుంచి 1977 వరకూ ఆ పార్టీ అధికారంలో ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ పార్టీకంటే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగి ప్రధాని మోడీ రికార్డు సృష్టించనున్నారని ఆయన అన్నారు.