ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లింల‌కు డిప్యూటీపై హ‌ర్షం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 08, 2019, 02:30 PM

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి కేటాయించడం పై జమాతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ హర్షం వ్యక్తం చేసింది. సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని సామాజిక వర్గాలకూ పదవులు కేటాయించడం అభినందనీయం చాంద్ బాడాలోని జమాత్ కార్యాలయంలో యూనిట్ అధ్యక్షులు సి.యం.జక్రియా, నాయకులు మోమిన్ గౌస్, అబ్దుల్ సమద్ మాట్లాడుతూ ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తపరిచారు. రాష్ట్రంలో ఇది మంచి సంప్రదాయం అని, నామినేటెడ్ పదవుల్లో, పార్టీ పదవుల్లో సైతం ముస్లిం మైనారిటీలకు సముచిత స్థానం కలిగిస్తారని ఆశాభావం వ్యక్తపరిచారు. ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచినట్లు మధ్యపానం దశలవారిగా రద్దుపరచాలని విజ్ఞప్తి చేసారు. రాబోయే కాలంలో మతతత్వ శక్తులను రాష్ట్రంలో వేళ్ళూనుకోనివ్వకుండా  ముఖ్యమంత్రి చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి అమ్జద్ బాషాకు కేటాయించిన వక్ఫ్ శాఖకు స్వయంప్రతిపత్తి కల్గించి వక్ఫ్ ఆస్తులు పరిరక్షీంచాలని కోరారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com