ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, బీఎస్పీ అధినేత మాయావతిపై భారత ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. మాయావతి ప్రచారంపై 48 గంటలపాటు ఆంక్షలు విధించిన ఈసీ ఆదిత్యనాధ్ పై 72 గంటల పాటు ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రచారం మత విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ ఆంక్షలు విధించింది. రేపు ఉదయం నుండి ఈ ఆంక్షలు అమలులోకి రానుండగా ఆంక్షలు ఉన్న సమయంలో ఈ ఇద్దరు నేతలు ఎటువంటి బహిరంగ సభలు, ప్రచార కార్యక్రమాలు, సోషల్ మీడియాలో కూడా ఎటువంటి ప్రచార వ్యాఖ్యలు చేయకూడదు. ఇక సుప్రీంకోర్టు మొట్టికాయల అనంతరం ఈసీ చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది.