అమరావతి : ఎలక్షన్ కమిషన్ ఎవరికీ అనుకూలంగా ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేదీ అన్నారు. ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు. తమ మీద ఎవరి ఒత్తిడీ లేదని ఆయన చెప్పారు. చంద్రబాబు అంటే తమకు గౌరవం ఉందని, ఇ.సి.ఐ ఆదేశాలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.