కోడికత్తి పార్టీని నమ్ముకుంటే జైలుకు వెళ్లాల్సిందేనని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ… పవన్ ను నమ్ముకుంటే అత్తారింటికి వెళ్తారన్నారు. నన్ను నమ్ముకుంటే మీ భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లినా మోడీని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కోడికత్తి పార్టీకి ఓటేస్తే… మోడీకి వేసినట్లేనన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. సీసీఎస్ పై కేంద్రానికి లేఖ రాస్తానన్నారు.కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని… 30లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. 18నుంచి 25ఏళ్లలోపు యువత ఆలోచించాలన్నారు. ఆలోచించి ఓట్లు వేయాలన్నారు. నాకు, జగన్ కు ఏమైనా పోలిక ఉందా అని చంద్రబాబు అన్నారు. తండ్రిని అడ్డు పెట్టుకొని రూ.లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్ అన్నారు. ఫామ్-7 దరఖాస్తు చేసి మన ఓట్లు తొలగించారన్నారు. మోడీ, కేసీఆర్ లనుంచి జగన్ కు డబ్బులు వస్తున్నాయన్నారు.