కర్ణాటకలోని 28 లోక్ సభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తోందని ఉత్తమ ప్రజాకీయ పక్ష అధినేత, సినీ నటుడు ఉపేంద్ర ప్రకటించారు. లోక్ సభకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అయితే తొలివిడతలో నామినేషన్ దాఖలు చేసిన 14 మంది అభ్యర్థులను ఉపేంద్ర మీడియాకు పరిచయం చేశారు. ప్రతి అభ్యర్థి సామాన్యుడిలా ఖాకీ చొక్కా ధరించి ప్రచారం చేస్తారని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార ఖర్చును అభ్యర్థులే భరించాలని, కరపత్రాలను మాత్రమే పార్టీ సమకూరుస్తోందని ఉపేంద్ర తెలిపారు.