జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆచంట గోడవారి రామచంద్రరావు గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. ఉదయం 11.30 గంటలకు తణుకులో బీసీ కల్యాణ మండపం సమీపంలో, మధ్యాహ్నం ఒంటి గంటకు నిడదవోలు గణష్ చౌక్ వద్ద, మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లిగూడెం శేషమహల్ సర్కిల్, పైవంతెన దిగువన పవన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు.