భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గాంధీనగర్ లో నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి అమిత్ సా బరిలోకి దిగుతున్నారు. గాంధీనగర్లోని రిటర్నింగ్ అధికారికి అమిత్ షా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు అరుణ్జైట్లీ, రాజ్నాథ్ సింగ్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు.