ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయ ఐటీ కంపెనీలపై డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి

international |  Suryaa Desk  | Published : Wed, Feb 13, 2019, 03:29 PM

అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ ఐటీ కంపెనీలపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు ఒత్తిడి తీవ్రతరమైంది. ఐటీ కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని ఎత్తి చూపుతూ, ఐటీ కంపెనీలపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో ఐటీ కంపెనీల్లో పని చేసే భారతీయులను తొలగించి, వారి స్థానంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఫలితంగా అనేక మంది భారతీయ టెక్ నిపుణులు స్వదేశీ బాట పట్టాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది.


ముఖ్యంగా, దేశ ఐటీ రంగానికి వెన్నెముకగా ఉన్న టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్.సి.ఎల్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు అమెరికాలో కూడా కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి గత యేడాది 99,010 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. కానీ 2019లో పరిస్థితి భిన్నంగా ఉంది.


డోనాల్డ్ ట్రంప్ సర్కారు హెచ్1బీ వీసాలను కఠినతరం చేయడంతో పాటు కార్యాలయాల్లో స్థానికులకు అవకాశాలు పెంచాలంటూ భారత ఐటీ కంపెనీలపై ఒత్తిడి పెంచింది. దీంతో భారతీయ టెక్‌ కంపెనీలు తదనుగుణంగా వ్యాపార వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంతో పోలిస్తే అమెరికాలో అక్కడి వారికి ఉద్యోగమిచ్చేందుకే మొగ్గుచూపుతున్నాయి.


విప్రో అమెరికా కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిలో 50 శాతానికి పైగా ఉద్యోగులు స్థానికులే. టీసీఎస్‌ 2011-17 మధ్య కాలంలో అమెరికాలో 17,000 మందిని ఉద్యోగంలో చేర్చుకుంది. గత ఏడాదిలో మొత్తంగా 27,049 మందికి ఉద్యోగాలిచ్చిన టీసీఎస్‌.. అందులో మెజారిటీ సిబ్బందిని అమెరికా కార్యాలయాల్లోనే నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2020 నాటికి యూఎస్‌ మార్కెట్లో 10 వేల మందికి ఉద్యోగావకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన ఇన్ఫోసిస్‌.. గత ఏడాది వరకు 7,600 మందికి పైగా నియమించుకుంది. ఫలితంగా భారతీయ టెక్ నిపుణులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com