ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపావళికి స్పెషల్‌గా మోదీ లడ్డూ.. ఇందులో ఏం కలిపి తయారు చేశారో తెలుసా?

national |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 11:03 PM

తమకు ఇష్టమైన సెలబ్రిటీపై ఉన్న అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. ఇక వివిధ వర్గాల వారు తమకు ఉన్న ఇష్టాన్ని.. తమదైన శైలిలో చూపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం దీపావళి పండగ సీజన్ వస్తుండటంతో ఈ స్వీట్ షాప్ యజమాని కొత్తగా ఆలోచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తనకు ఉన్న ఇష్టాన్ని చూపించుకునేందుకు మోదీ లడ్డూ పేరుతో ఒక స్వీట్‌ను తయారు చేస్తున్నాడు. అయితే మోదీ అంటే తనకు ముందు నుంచీ అభిమానం ఉందని.. అందుకే ఆయన మొదట ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి.. ఏటా దీపావళికి ప్రత్యేకంగా స్వీట్లు తయారు చేస్తున్నట్లు తెలిపాడు. కానీ ఇప్పుడు వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎన్నికకావడంతో ఈసారి మరింత స్పెషల్‌గా మోదీ లడ్డూను తయారు చేస్తున్నట్లు ఆ స్వీట్ షాప్ ఓనర్ వెల్లడించాడు.


బీహార్‌కు చెందిన స్వీట్ షాప్ యజమాని సంజీవ్‌ శర్మకు ముందు నుంచీ మోదీ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే 2014లో తొలిసారి ప్రధానిగా మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రాయల్‌ లడ్డూలకు "మోదీ లడ్డూ" అనే పేరును పెట్టాడు. దీంతో సంజీవ్ శర్మ విక్రయించిన ఈ మోదీ లడ్డూలకు మంచి గిరాకీ వచ్చింది. అంతేకాకుండా అతడికి మంచి పేరు కూడా వచ్చింది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి.. వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీకి గౌరవంగా.. మోదీ లడ్డూలను మరింత ప్రత్యేకంగా తయారు చేయాలనుకున్నాడు. అందుకే ఈ దీపావళి సందర్భంగా తయారు చేసే మోదీ లడ్డూల్లో పవిత్రమైన గంగాజలాన్ని కలుపుతున్నట్లు సంజీవ్ శర్మ వెల్లడించాడు.


మోదీ తొలిసారి ప్రధాని అయినపుడు ఆయనకు గౌరవంగా మోదీ లడ్డూలను తయారు చేయగా.. వాటికి ఎంతో ప్రజాదరణ రావడంతో పాటు తనకు కూడా మంచి పేరు వచ్చిందని తెలిపాడు. ఇక ఈ మోదీ లడ్డూల తయారీలో దేశీయంగా తయారైన నెయ్యి, కుంకుమ పువ్వు, బాదం, పిస్తాలను వినియోగిస్తున్నట్లు వెల్లడించాడు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు కాబట్టి.. ఈ దీపావళికి ప్రత్యేకంగా పవిత్రమైన గంగాజలంతో మోదీ లడ్డూలను తయారు చేస్తున్నామని వివరించాడు. ఈ లడ్డూలతో గంగా, యమున, సరస్వతి నదుల నాగరికత చరిత్రను ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయాలనేది తన ఉద్దేశమని సంజీవ్‌ శర్మ స్పష్టం చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com