ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్ దే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 08:23 PM

వైసీపీ నేతలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా, చిల్లకూరు మండలం నాంచారం పేటలో వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయులు మధ్య జరిగిన ఘర్షణలో మల్లారపు హరిప్రసాద్‌ అనే వ్యక్తి మరణించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీలో ఉన్న హరిప్రసాద్ మృతదేహాన్ని గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గం టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు టీడీపీ నేతలు పరామర్శించారు.


ఈ సందర్భంగా మీడియాతో సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి మాట్లాడుతూ... వైసీపీ మూకలు టీడీపీ కార్యకర్త హరిప్రసాద్‌పై బీరు బాటిళ్లతో పెట్రోల్ పోసి, దాడి చేసి దారుణంగా హత్య చేయడం దారుణమని అన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్లు సర్వనాశనం చేసి ప్యాలెస్‌లో శాంతి వచనాలు చెబుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు శాంతియుతగా ఉండాలని చెప్పడంతో టీడీపీ శ్రేణులు మౌనంగా ఉన్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com