ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల పేరు మార్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 09:04 PM

మచిలీపట్నం మెడికల్ కాలేజీకి భారత త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మహనీయునికి ఘన నివాళిగా ఇక నుంచి మచిలీపట్నం వైద్య కళాశాలను శ్రీ పింగళి వెంకయ్య గవర్నమెంట్ మెడికల్ కాలేజిగా పిలవనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు జీవో జారీ చేశారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెట్టాలని రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనను ఆమోదిస్తూ, ఈ జీవో తీసుకువచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com