ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ల టైమింగ్స్ మారిపోయాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:25 PM

ఏపీతో పాటూ తెలంగాణ రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక. హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి బయల్దేరే ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పులు చేశారు అధికారులు. సికింద్రాబాద్‌-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్‌ (12710) ఇకపై ప్రతిరోజూ సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 10.05 గంటలకు బయల్దేరుతుందని చెప్పారు. అలాగే లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ (12734) లింగంపల్లి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరుతుంది. నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ (17231) నర్సాపురం నుంచి ఉదయం 9.50కి బయల్దేరుతుంది. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌(12764) రైలు షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఈ రైళ్లు ప్రస్తుతం మారిన సమయాల్లోనే నడుస్తున్నాయి.


లింగంపల్లి - తిరుపతి మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (12734) రైలు ప్రయాణ సమయాల్లో మార్పులు చేశారు. ఈ రైలు ప్రతి రోజూ సాయత్రం 5.30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.55 గంటకు తిరుపతికి చేరుతుంది. లింగంపల్లిలో బయల్దేరిన రైలు సికింద్రాబాద్‌కు సాయంత్రం 6.05 గంటలకు వెళుతుంది.. ఆ తర్వాత గుంటూరుకు రాత్రి 10.55 గంటలకు చేరుతుంది. అలాగే నెల్లూరుకు 2.48 గంటలకు వెళుతుంది. లింగంపల్లిలో బయల్దేరిన తర్వాత.. ఈ రైలుకు బేగంపేట, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లరు, గుడూరు, వెంకటగిరి, శ్రీకళాహస్తి, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో హాల్ట్‌లు ఉన్నాయి.


సికింద్రాబాద్‌-గూడూరు మధ్య నడిచే సింహపురి ఎక్స్‌ప్రెస్‌(12710) సమయాల్లో మార్పు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 10.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.55 గంటలకు గూడూరు వెళుతుంది. ఈ రైలు గతంలో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.40కి గూడూరు వెళ్లేది. రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 10.05కు బయలుదేరి.. విజయవాడకు తెల్లవారుజామున 3.35 గంటలకు వెళుతుంది.. నెల్లూరుకు 7.58 గంటలకు, గూడూరుకు 8.55 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలుకు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, బిట్రగుంట, నెల్లూరు, వేదాయాపాలెం రైల్వే స్టేషన్‌లలో స్టాపులు ఉన్నాయి.


సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌(12764) రైలు ప్రయాణ సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు అధికారుల. ఈ రైలుకు సికింద్రాబాద్ నుంచి గూడూరు వరకు ప్రయాణ సమయాల్లో ఎలాంటి మార్పు చేయలేదు.. కాకపోతే గూడూరుకు 4.19 గంటలకు చేరుకుంటుంది. రేణిగుంటకు 5.58 గంటలకు తిరుపతి 6.55 గంటలకు వెళుతుందని చెప్పారు.


నర్సాపురం నుంచి మహారాష్ట్రలోని నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ (17231) ప్రయాణ సమయాల్లో మార్పులు చేశారు. ఈ రైలు నర్సాపురం నుంచి ఉదయం 9.50కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30కి నాగర్‌సోల్‌ వెళుతుంది. ఈ రైలు విజయవాడకు మధ్యాహ్నం 12.50 గంటలకు, సికింద్రాబాద్‌కు సాయంత్రం 7.50 గంటలకు, నాందెడ్‌కు అర్దరాత్రి 00.50 గంటలకు చేరుతుంది. ఈ రైలుకు ఏపీలోని పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి స్టేషన్‌లలో ఆగుతుంది. తెలంగాణలోని మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజమాబాద్, బాసర స్టేషన్‌లలో స్టాప్‌లు ఉన్నాయి. మహారాష్ట్రలోని ధర్మాబాద్, ముడ్‌ఖేడ్‌, నాందేడ్, పూర్ణ, పర్బనీ, జల్న, ఔరంగబాద్ హాల్ట్‌లు ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com