ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల అక్రమ రవాణాను అరికట్టాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 12, 2024, 10:31 PM

మానవ అక్రమ రవాణాను అరికట్టాలని మదనపల్లె పట్టణంలో ప్ర జా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. గ్రామజ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వెలుగు ప్రత్యేక స్కూల్‌లో రౌండ్‌ టెబుల్‌ సమావేశం నిర్వహించారు. ముందుగా మానవ అక్రమ రవాణాకు గురైన వారి కొరకు, హత్యలకు బలైనవారి కోసం పూలతో నివాళులర్పించి క్యాండిల్స్‌ వెలిగించి మౌనం పాటించారు. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అందరూ అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు.


ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఉపాధి, సినిమా అవకాశాల పేరుతో అక్రమ రవాణా అధికంగా ఉందని, అరికట్టే దిశగా చర్యలు చేపట్టడంతోపాటు అవగాహన కల్పించాలన్నారు. మహిళలను బలవంతపు వ్యభిఛారంలోకి దించే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గ్రామజ్యోతి సొసైటీ సుభద్ర, వెలుగు ఉదయ మోహనరెడి, భాగ్యలక్ష్మీ సంస్థ మునిరత్నం, మలమహానాడు అధ్యక్షుడు యమల సుదర్శనం, సీపీఎం శ్రీనివాసులు, సీనియర్‌ సిటిజన్స మునిగోపాల్‌ కృష్ణ, పియర్స్‌ సంస్థ వేమనారాయణ, రీడో సంస్థ ఈశ్వరయ్య, పీపుల్‌ రూరల్‌ డెవలప్‌ మెంట్‌ ఎడ్యుకేషన సొసైటీ అధ్యక్షుడు బొజ్జప్ప, ఫోర్డు సంస్థ లలితమ్మ, చైతన్య సేవాసంస్థ కవితారాణి, హెల్పింగ్‌ మైండ్స్‌ సంస్థ అబూబక్కర్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com