ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికులకు రెండు చేతులెత్తి దండం పెట్టిన పోలీసులు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 12, 2024, 08:35 PM

చిత్తూరు జిల్లాలో ఆసక్తికర ఘటనజరిగింది. పోలీసులు పోలీసులకు రెండు చేతులు జోడించి నమస్కరించడం కనిపించింది. చిత్తూరు-పుత్తూరు నేషనల్ హైవేపై కొల్లాగుంట చెక్‌పోస్టు దగ్గర ఓ లగేజీ ట్రక్కు వెళుతోంది. పోలీసులు చెయ్యెత్తి ఆ ట్రక్కును ఆపారు.. అందులో ప్రయాణిస్తున్నవారికి భయం మొదలైంది. పోలీసులు ట్రక్కును ఎందుకు ఆపారనే గుండెలు అదిరిపోయాయి. డ్రైవర్ కూడా కంగారుపడ్డారు.. పోలీసులు ఆపడంతో తనకు జరిమానా విధిస్తారేమోనని అనుకున్నారు. ట్రక్కు డోర్ తీసి చూడగా.. అందులో జనాలు కిక్కిరిస ఉన్నారు.. వారంతా భయం భయంగా చూస్తుండగా ఎస్సై, కానిస్టేబుల్ రెండు చేతులు జోడించి నమస్కరించారు,


దయచేసి ఇటువంటి ప్రయాణాలు చేయొద్దని.. ప్రాణాలు తీస్తాయని, కుటుంబాలు విషాదంలోకి వెళతాయని వివరించి చెప్పారు. ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులను తలచుకుని భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మరోసారి ఇలా లగేజీ వాహనంలో ప్రయాణికులను ఎక్కించుకుంటే చర్యలు తప్పవని డ్రైవర్‌ను కూడా ఎస్సై హెచ్చరించారు. ఇదంతా చూసిన ట్రక్కులోని ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. కార్వేటినగరం ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ వాహనాలను కానిస్టేబుల్‌తో కలిసి తనిఖీ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ప్రజల విషయంలో వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అందరూ శభాష్‌ అంటూ పొగుడుతున్నారు.


మరోవైపు తిరుపతిలో ఛార్జీలు అదనంగా వసూలు చేసే ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ కొరడా ఝళిపించింది. పలు ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారులు ప్రైవేటు బస్సులను తనిఖీల చేశారు. అలాగే బ్రీత్‌ అనలైజర్ల ద్వారా డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించారు. దసరా పండగ సందర్భంగా వాహన రద్దీ, రహదారి భద్రత, అధిక ఛార్జీల వసూళ్లపై తనిఖీలు చేశారు. హైదరాబాద్, బెంగళూరు నుంచి జిల్లా మీదుగా వెళ్లే ప్రైవేటు బస్సులను రవాణాశాఖ అధికారులు పరిశీలించారు.. తమ సిబ్బందితో సోదాలు నిర్వహించారు. ఆల్‌ ఇండియా పర్మిట్, పన్ను చెల్లించని ట్రావెల్‌ బస్సును సీజ్‌ చేశారు. ఆ బస్సులో ఉన్నవారిని మరో వాహనంలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చారు. అంతేకాదు అధిక ఛార్జీలు వసూలు చేసిన మరో పది ప్రైవేటు బస్సులకు జరిమానా విధించారు. పన్నులు, జరిమానా రూపంలో సుమారు రూ.6 లక్షలు వసూలు చేశారు రవాణాశాఖ అధికారులు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com