ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఎఫ్ఎస్ఎస్ఏఐ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఒప్పందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 10:05 PM

ఏపీ ప్రభుత్వం ఆహార భద్రత తనిఖీల కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.ఇందులో భాగంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ రాష్ట్రంలో పలు చోట్ల ప్రయోగశాలలు, మౌలిక వసతుల ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందికి శిక్షణ ఇవ్వనుంది. తిరుమల, విశాఖపట్నం, కర్నూలులో మైక్రోబయాలజీ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఐదు ప్రాథమిక ప్రయోగశాలలు, 15 మొబైల్ ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి ల్యాబ్ లో రూ.21 కోట్లతో మౌలిక వసతుల ఏర్పాటుకు ఎఫ్ఎస్ఎస్ఏఐతో ఒప్పందం కుదిరింది. గత ఐదేళ్లలో ఆహార భద్రత, ప్రమాణాల్లో రాష్ట్ర ర్యాంకు బాగా పతనమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com