ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి లోకేశ్ తో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 09:48 PM

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ టాటా సన్స్ సంస్థ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తో అద్భుతమైన సమావేశం జరిగిందని వెల్లడించారు. దీనికి సంబంధించి రేపు ఒక భారీ ప్రకటన వెలువడనుంది... సిద్ధంగా ఉండండి అంటూ లోకేశ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో కలిసున్న ఫొటోను కూడా పంచుకున్నారు. లోకేశ్ ట్వీట్ చూస్తుంటే... రాష్ట్రానికి ఒక భారీ పరిశ్రమ వచ్చే అవకాశాలున్నట్టు అర్థమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com