ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం నిధులపై ప్రధానితో చర్చించిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 05:57 PM

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అందజేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా దేశ రాజధానిలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ మేరకు ఇవాళ(సోమవారం) సాయంత్రం ఢిల్లీకి చేరుకుని ప్రధానితో భేటీ అయ్యారు.


రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం మెుదట విడత నిధులు, రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా అందించే రూ.15కోట్లపైనా ఇరువురు చర్చించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అంశాలనూ ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com