ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దోషులను శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోనళన చేపడుతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 05:48 PM

పుంగనూరులో కిడ్నాప్ తర్వాత దారుణ హత్యకు గురైన చిన్నారి అశ్వియ‌ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చిన్నారి మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా కూడా పోలీసులు దోషులపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ లేదని, పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా రాలేదని చెప్తున్నారన్నారు.


చిన్నారి దారుణంగా చనిపోతే ప్రభుత్వం ఇంత‌వ‌ర‌కు స్పందించలేదన్నారు. కానీ ఏమీ జరగనటువంటి మదనపల్లి సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాద ఘటనలో మాత్రం డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి పంపిందన్నారు. అయితే, చిన్నారి చనిపోతే ఇప్పటివరకు సీఎం గాని, మంత్రులు గాని స్పందించలేదన్నారు. పోలీసులు వెంటనే స్పందించి దోషులను శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. తొమ్మిదో తారీఖున  మాజీ సీఎం వైయ‌స్ జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com