ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 3నుండి పాఠశాలలకు దసరా సెలవలు ప్రకటించిన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 02:51 PM

దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 12వ తేదీన దసరా పండుగ రానుంది. ఈ క్రమంలో పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 3వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈనెల 3 (గురువారం) నుంచి 13వ (ఆదివారం) తేదీ వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 రోజుల పాటు పండగ సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి ఈనెల 14వ (సోమవారం) తేదీన స్కూళ్లు పున: ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లకు ఈ నిర్ణయం వర్తించనుంది. మరోవైపు అక్టోబర్ 3 నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 12న విజయదశమి పండుగతో ఉత్సవాలు ముగియనున్నాయి. తొమ్మిరోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com