శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఎడి) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్పై విశ్రాంత న్యాయమూర్తి రంజిత్ సింగ్ క్రిమినల్ కేసు పెట్టారు. పంజాబ్లో గుళ్లను ధ్వంసం చేయడం, పోలీసు కాల్పుల ఘటనలపై విచారణ జరుపుతున్న బృందానికి రంజిత్సింగ్ నేతృత్వం వహించారు. సుఖ్బీర్సింగ్ బాదల్, సీనియర్ అకాలీ నేత బిక్రంసింగ్ మజీతియాలు తనపై ”అవాస్తవ, అభ్యంతరకర, పరువునష్టం కలిగించే” వ్యాఖ్యలను చేశారని ఆయన ఆరోపించారు. కమిషన్స్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్లోని 10-ఎ సెక్షన్ ప్రకారం వారిద్దరూ శిక్షించదగిన నేరానికి పాల్పడ్డారని ఆయన అన్నారు.