చిత్తూరు రూరల్ మండలంలోని పాలూరు, దిగువమాసాపల్లి స్టాక్ పాయింట్లలో మాత్రమే ఇసుక లభ్యమవుతుంది. దిగువమాసాపల్లిలో ప్రస్తుతం 91,126 మెట్రిక్ టన్నులు, పాలూరులో 9382 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ వుంది. బైరెడ్డిపల్లి మండలంలోని స్టాక్ యార్డును గనుల శాఖ అధికారులు తొలగించారు. ఇసుక కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంది.ఆయా కేంద్రాల పరిధిలో ఇసుక రవాణాకు సంబంధించి అనుమతులు, ట్రాక్టర్ల వివరాలు అవసరమైన వారికి అందిస్తారు. ట్రాక్టర్ (4.5 టన్నులు) ఇసుక రవాణా చార్జీలతో కలిపి స్టాక్ పాయింట్ నుంచి 10 కిలో మీటర్ల దూరానికైతే 607రూపాయలు చెల్లించాలి. 20 కి.మీ దూరానికి రూ.1152, 30 కి.మీ దూరానికి రూ.1728, 40 కి.మీ దూరానికి రూ.2304 చెల్లించాలి.6టైర్ల టిప్పర్ (10 టన్నులు) ఇసుక రవాణా చార్జీలతో కలిపి 10 కి.మీ దూరానికి రూ.1070, 20 కి.మీ దూరానికి రూ.2040, 30 కి.మీ దూరానికి రూ.3060, 40 కి.మీ దూరానికి రూ.4080 చెల్లించాల్సి వుంటుంది. ఇసుక వాహనాలకు జీపీఎస్ : ఇసుక రవాణాదారులందరూ తమ వాహనాలకు జీపీఎస్ అమర్చుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో నమోదు చేసుకున్న వినియోగదారుడికి ఇసుక సకాలంలో సరఫరా చేయకుంటే వాహన యజమానులకు జరిమానా విధించే అవకాశముంది.