గ్రామాల్లోని వంకల్లో, వాగుల్లో, నదీ ప్రాంతాల్లో ఇసుకను యంత్రాల ద్వారా కాకుండా అవసరమైనవారు సొంతంగా తవ్వుకుని వాడుకోవచ్చని చిత్తూరు కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు.నూతన ఇసుక పాలసీ గురువారంనుంచి అమలు కానున్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మంగళవారం ఆయన మాట్లాడారు.ఇసుక లభ్యత గురించి వివరించారు.చిత్తూరు రూరల్ మండలంలోని దిగువమాసపల్లె, పాలారుతో పాటు బైరెడ్డిపల్లె క్రాస్ వద్ద వున్న స్టాక్ పాయింట్లలో ఇప్పుడు దిగువమాసపల్లె స్టాక్ పాయింట్లో 90 వేల టన్నుల ఇసుక మాత్రమే ఉందన్నారు. మిగిలిన రెండు పాయింట్లలో ఇసుక అయిపోయిందని, ఈ పరిస్థితుల్లో తదుపరి ఏం చేయాలనేది ఆలోచిస్తున్నామన్నారు. తిరుపతిలో స్టాక్ పాయింట్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి తెచ్చుకోవచ్చన్నారు.