ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు పట్టాలు తప్పడంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 05:59 PM

ఇండోర - జబల్‌పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రెండు కోచ్‌లు పట్టాలు తప్పినప్పటికీ ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదు. పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇండోర్ - జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని ఆరో నెంబర్ ప్లాట్ ఫామ్‌కు చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఆ సమయంలో రైలు వేగం చాలా తక్కువగా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్లాట్ ఫామ్‌పై ఆగుతున్న సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. రైలు పట్టాలు తప్పడంతో ఆ లైన్‌లో వెళ్లాల్సిన ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com