ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామోజీ సంస్థలను కాపాడడమే చంద్రబాబు లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 12:47 PM

మార్గదర్శి చిట్స్‌ కేసుల్లో సీఐడీ అప్పీళ్ల ఉపసంహరణ  కచ్చితంగా క్విడ్‌ప్రొకో అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. రామోజీ కుటుంబాన్ని, ఆయన సంస్థలను కాపాడడమే చంద్రబాబు లక్ష్యం అన్న రాంబాబు.. రామోజీరావు అనేక అక్రమాలకు పాల్పడిన వ్యక్తి అని, ఆర్ధిక నేరస్తుడని, వైట్‌ కాలర్‌ క్రిమినల్‌ అని అభివర్ణించారు. చంద్రబాబు కోసం రామోజీ సంస్ధలు.. రామోజీ సంస్ధల కోసం చంద్రబాబు పని చేస్తారన్న ఆయన, ఇది కచ్చితంగా క్విడ్‌ప్రొకో కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ఆ క్విడ్‌ప్రొకోపై తప్పనిసరిగా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com