ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలశ ప్రతిష్ఠ మహోత్సవానికి ప్రత్యేక దళాలతో పెద్దఎత్తున పోలీసు బందోబస్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 12:48 PM

కడప జిల్లా, చెన్నూరు, లలితాంబికా సమేత నాగేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ట్రంకురోడ్డులోని నాగేశ్వరాలయం ఎదురుగా మసీదు ఉండడంతో బుధవారం నాటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏఎస్పీ వెంకటరాముడు ఆధ్వర్యంలో సీఐ పురుషోత్తం రాజు నేతృత్వంలో పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప నుంచి వచ్చిన ప్రత్యేక దళాలు బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు అక్కడే మకాం వేశారు.ఆలయం చుట్టూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఆలయం వద్ద అత్యధిక సంఖ్యలో స్థానిక నేతలు, యువత ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com