ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే నెల 3న లండన్‌ వెళ్లనున్న జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 12:29 PM

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వచ్చే నెల 3న సతీసమేతంగా లండన్‌ బయల్దేరుతున్నారు. కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం 25 దాకా అక్కడ పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల ఆయనకు అనుమతి ఇచ్చింది. అక్రమాస్తుల కేసులు ఒకవైపు.. ముఖ్యమంత్రిగా పాలనా సమయంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలపై విచారణలు ఇంకోవైపు.. పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్‌రావు రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లేందుకు సమాయత్తం కావడం, పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు తప్ప మిగతావారు పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారంతో భవిష్యత్‌పై వైసీపీ శ్రేణు లు కలవరపడుతున్నాయి. ఈ తరుణంలో ఆయన విదేశీ పర్యటన వారిని ఇరకాటంలో పడేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత జగన్‌ వ్యవహార శైలి వారికి అంతుపట్టడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com