ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యని పరిష్కరించాలంటూ ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 07:40 PM

స్థల సమస్య పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించారు. కిరోసిన్‌ను ఒంటిపై పోసుకున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మండలం కూర్మాయిపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం(34)కు ఒకటిన్నర సెంటు ఇంటి స్థలం ఉంది. ఆయనకు తెలియకుండా ఆ స్థలాన్ని అతడి అక్క అమ్మేసింది. స్థలాన్ని ఇప్పించాలని ఐదేళ్ల నుంచి సుబ్రహ్మణ్యం కుప్పం తహసీల్దార్లు, ఆర్డీవో, కలెక్టర్లకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కలెక్టరేట్‌కు చేరుకున్నారాయన. తనవెంట తెచ్చుకున్న కిరోసిన్‌ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అందుబాటులో లేకపోవడంతో డీఆర్వో పుల్లయ్య వద్దకు తీసుకెళ్లారు. పూర్తి సమాచారం తెలుసుకున్న డీఆర్వో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఇంటికి పంపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com