ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏ సమస్య ఉన్నా నేను అండగా ఉంటాను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 07:39 PM

తాడిపత్రి పట్టణంలోని యల్లనూరురోడ్డులో ఉన్న ద్వారకా విల్లాస్‌ను ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి బుధవారం పరిశీలించారు. రెండురోజులక్రితం కొందరు విల్లాపై రాళ్లదాడి చేయడంతో సీసీ కెమెరాలు, కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఎమ్మెల్యే ధ్వంసమైన వస్తువులను పరిశీలించారు. సొంత ఖర్చులతో మరమ్మతులు చేయిస్తానని తెలిపారు. అనంతరం విల్లాలో కలియతిరిగి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదని తెలిపారు. ఏ సమస్య ఉన్నా తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట టీడీపీ నాయకులు హరినాథ్‌రెడ్డి, పవనకుమార్‌రెడ్డి, మల్లేశ్వరరెడ్డి, మధు, ఖాదర్‌, రంగనాథ, నాయుడు, శివారెడ్డి తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com