ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసీసీ నూతన చైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శి జైషా...

sports |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 09:17 PM

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నూతన చైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. జగ్ మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసణ్ , షాహింక్ మనోహర్ తర్వాత క్రికెట్ గ్లోబల్ గవర్నింగ్ అథారిటీకీ నాయకత్వం వహించిన ఐదవ భారతీయుడు జైషా. గతంలో భారత్ నుంచి జగ్ మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ లు ఐసీసీ ఛైర్మన్ గా వ్యవహరించారు. తాజాగా ఐసీసీ ఛైర్మన్ గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతో ఐసీసీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టనున్న ఐదో భారతీయుడిగా జై షా నిలవనున్నారు. కేవలం 36 ఏళ్ల వయసులో ఐసీసీ పగ్గాలు చేపట్టనున్న పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com