ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసీ త్వరితగతిన జోక్యం చేసుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 05:18 PM

ఏపీలో పోలింగ్ శాతం వివ‌రాల‌పై త‌మ‌కు అనుమానం ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. ఇవాళ సచివాలయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు,  మేరుగు నాగార్జున , ఎమ్మెల్సీ  లేళ్ల అప్పిరెడ్డి , మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్ ను వైయస్ఆర్ సీపీ నేతలు కలిసి ఫారం-20 సమాచారాన్ని అప్ లోడ్ చేయలేదని ఫిర్యాదు చేశారు.  ఎన్నికల వ్యవస్ధ, ఈసీ పనితీరుపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎన్నికల శాతాన్నిపెంచుకుంటూ పోయారు, 175 నియోజకవర్గాల నుంచి ఫామ్‌ 20 తెప్పించుకోవాలి, కానీ ఈ రోజుకూ ఈసీ డేటా తెప్పించలేదు. దీనిపై అనేక సంస్ధలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి, ఈసీని త్వరితగతిన జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాం, ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా మీరు స్పందించాలని చెప్పాం అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com