ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిశ్రామిక పార్క్‌ల జాబితాలో తెలుగురాష్ట్రాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 10:12 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు గుడ్‌న్యూస్ రానుంది. కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల కోట్లతో 12 పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేయనుంది. ఈ పార్కులు ఏర్పాటు కానున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఈ భారీ ప్యాకేజీని కేంద్ర కేబినెట్ త్వరలోనే త్వరలో ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బీహార్, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, ఇతర ప్రాంతాల్లో కొత్తగా ఈ పారిశ్రామిక పార్కులను కేంద్రం ఏర్పాటు చేయబోతోంది. కేబినెట్ తీసుకోనున్న ఈ నిర్ణయంతో రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక పురోగతిని గణనీయంగా పెంచుతుందని కేంద్రం యోచిస్తోంది. ఈ వారంలోనే కేబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉందని సమాచారం. సుమారు రూ.25,000 కోట్ల ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. ఈ కొత్త ప్రాజెక్టులు రూ.1.5 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించగలవని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా గృహ, వాణిజ్య ప్రాంతాలతో కూడిన సగటు పారిశ్రామిక నగరాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలవని విశ్వసిస్తోంది. ఈ పారిశ్రామిక పార్కుల ద్వారా దేశీయంగా తయారీని పెంచడం, ఉపాధిని సృష్టించడం సాధ్యమని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com