ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు సైతం కదలిరావాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 09:54 PM

టీడీపీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. తేటగుంట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన తునికి చెందిన కీలక నేతలతో సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల రూ పకల్పనపై చర్చించారు. ప్రణాళికాబద్ధంగా తుని పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేద్దామని యనమల తెలిపారు. ఇప్పటికే రూ.1.5కోట్ల నిధుల మంజూరుతో ప్రారంభమైన అభివృద్ధి పనులు పురోగతిపై సమీక్షించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ గడువులోపు పనులు ముగించాలని సూచించారు. కార్యక్రమంలో ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూ రి వెంకటేష్‌, నార్ల రత్నాజీ, తటపర్తి రాజా, సిద్దాంతపు సత్తిబాబు, మళ్ళ గణేష్‌లతో పాటుగా మాజీ కౌన్సిలర్లు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com