ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాగునీటి సమస్యను పరిష్కరిస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 09:26 PM

గుంతకల్లు మండలంలోని వైటీ చెరువు నుంచి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి చెరువుకు నీటిని విడుదల చేశారు. ఆయన శనివారం ఉదయం వైటీ చెరువు తూమును తెరచి నీటిని వదిలారు. గుత్తి పట్టణానికి నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో చెరువును నింపే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుత్తిలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తున్నామన్నారు. అందులో భాగంగా తొలుత గుత్తి చెరువును నింపే కార్యక్రమానికి నాంది పలికినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణస్వామి, శ్రీనివాసులు, పట్టణాధ్యక్షుడు బండారు ఆనంద్‌, లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బీఎస్‌ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com