మార్కాపురం నియోజక వర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే కందుల నారాణరెడ్డి అన్నారు. మండలంలోని దరిమడుగు గ్రామంలో శుక్రవారం ఎంపీడీవో చందన అధ్యక్షతన జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గ్రామసభ కార్యక్రమానికి ఎమ్మె ల్యే కందుల నారయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంద న్నారు. గత వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందన్నారు. 2014 నుంచి 2019 టీడీపీ హయాంలో నియోజకవర్గంలో 85 కి.మీ. సీసీ రోడ్లు వేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం 7 కి.మీ. మాత్రమే సీసీ రోడ్లు వేసిందన్నారు. నియోజక వర్గంలోని తర్లుపాడు మండలం బుడ్డపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రణా ళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలో మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొంది స్తోందన్నారు. తద్వారా మార్కాపురం ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి పథంలో నడుస్తుం దన్నారు. కూటమి ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా సాగర్ నీటి సరఫరా చేయిస్తామ న్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి, ఏపీవో జీవరత్నం, గ్రామ సర్పంచ్ బట్టగిరి గౌతమి గోపాల్రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు జవాజి రామాంజులరెడ్డి, దేవిరెడ్డి శ్రీనివాసులు, ఏపీఎం రమేష్ బాబు, ఉద్యానవన శాఖ అధికారి రమేష్, టీడీపీ నాయకులు కాకర్ల శ్రీనివాసులు, కొత్తపల్లి సర్పంచ్ మట్టం వెంకటేశ్వర్లు, మండలస్థాయి అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.