ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఉచిత బస్సు పథకం,,,,కీలక నివేదిక సిద్ధం చేసిన అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 09:16 PM

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఈ పథకం అమలు ఆలస్యం అవుతుందంటున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే.. బస్సుల్లో రద్దీ పెరుగుతుంది. అందుకే అదనపు బస్సులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఖాళీలున్న డ్రైవర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.. ఈ మేరకు ఓ నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


 ఇలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి.. ఆ తర్వాత ఈ పథకం అమలు చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఒకవేళ అదనపు బస్సుల్ని ఏర్పాటు చేయకపోతే చాలీచాలని బస్సులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇవాళ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటకలో ఉచిత ప్రయాణంపై చేసిన అధ్యయనం వివరాలను చంద్రబాబుకు తెలియజేయనున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీలో 10 వేల బస్సులు ఉన్నాయి.. వాటిలో సొంత బస్సులు 8,220 ఉంటే.. మిగిలినవి అద్దె బస్సులు. ఇటీవల 1,480 కొత్త బస్సుల కొనుగోలు చేయగా.. వీటిలో ప్రతినెలా కొన్ని చొప్పున బస్సులు బాడీబిల్డింగ్‌ పూర్తిచేసుకొని డిపోలకు వస్తున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే.. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని అంచనా వేస్తున్నారు. దీని కోసం అదనంగా కనీసం 2 వేల కొత్త బస్సులు అవసరమని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. అలాగే ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతోంది. అందుకే 3,500 మంది వరకు డ్రైవర్‌ పోస్టులు భర్తీచేయాలని నివేదిక రూపొందించారు అధికారులు.


అంతేకాదు రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే.. నెలకు ఆర్టీసీకి రూ. 250-260 కోట్ల వరకు రాబడి తగ్గుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతినెలా ఆర్టీసీకి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతినెలా వచ్చే రాబడిలో 25 శాతం (దాదాపు రూ.125 కోట్లు) ప్రభుత్వం తీసుకుంటోంది. ఇకపై ఈ మొత్తాన్ని (రూ.125 కోట్లు) ప్రభుత్వం తీసుకోకుండా.. అలాగే మిగిలిన రూ.125-135 కోట్లు అదనంగా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఆగస్టు 15 నుంచి అమలు చేస్తారని భావించినా.. ఆ దశంగా అడుగులు వేయలేదు. అందుకే ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com