ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 22న అమలాపురంలో జాబ్‌మేళా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 08:47 PM

ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో 705 పోస్టుల భర్తీకి ఈనెల22న అమలాపురంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారిణి ఇ.వసంతలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద ఉదయం 10.30గంటల నుంచి జాబ్‌మేళా జరుగుతుందన్నారు. తిరుపతి అమర్‌రాజా గ్రూపు కంపెనీలో 300 మెషీన్‌ ఆపరేటర్‌ పోస్టులు, కోనసీమ శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 105 సేల్స్‌ ఆఫీసర్స్‌ అండ్‌ ఏఎస్‌ఎం పోస్టులు, క్వెస్‌ క్రాప్‌ ఎస్బీఐ కార్డ్స్‌లో 300బ్రాంచ్‌ రిలేషన్‌షిప్‌ పోస్టులు భర్తీ జరుగుతుందన్నారు. అభ్యర్ధులు 18-35ఏళ్ల వయస్సు, పదోతరగతి, ఐటీఐ ఆపైన విద్యార్హత ఉండాలన్నారు. వేతనం 11-22 వేల మధ్య ఉంటుందన్నారు. అభ్యర్థులు బయోడేటాతో పాటు సర్టిఫికెట్ల నకళ్లు తీసుకురావాలన్నారు. వివరాలకుసెల్‌:8121838392ను సంప్రదించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com