ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజా తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 08:46 PM

ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న గంజాయిని రాజమహేంద్రవరం సెబ్‌ సౌత్‌ స్టేషన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ పి.హనుశ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. తమ సిబ్బందితో దివాన్‌చెరువు జీరో పాయింట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మూడు ద్విచక్ర వాహనాల్లో ఒడిశాలోని కలిమెల మండలం నాగులూరు గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామానికి గంజాయి తరలిస్తున్న ట్టు గుర్తించామన్నారు. మూడు వాహనాల్లో 46.81 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నాగులూరుకు చెందిన శంకం రాజుబాబు, పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలానికి చెందిన గళ్ల ఐజాక్‌ రాజు, కలిమెల మండలం పెట్టాల్‌ గ్రామానికి చెందిన వేలుసేరి బుజ్జి, వేలుసేరి వెంకీలను అదుపులోకి తీసుకున్నామని హనుశ్రీ పేర్కొన్నారు. తనిఖీల్లో డీటీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.గోపాలకృష్ణ, ఎస్‌ఐ వై.దుర్గాప్రసాద్‌, శ్రీనివాసులు, డీటీఎఫ్‌ ఎస్‌ఐ ఆర్‌.క్రాంతి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com