ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ని సేవలకన్నా పేదవారికి ఆహారం అందింటం మిన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 04:17 PM

విజయనగరంలో రెండు అన్నా క్యాంటీన్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎం.పి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. అన్నం పెట్టే వారిపై కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం కేసులు బనాయించిందని మండిపడ్డారు. అన్ని సేవలకన్నా పేదవారికి ఆహారం అందింటం మిన్న అని అన్నారు. తరతరాల నుంచి విజయనగరంలో ఆకలితీర్చే సంస్కృతి కొనసాగుతోందన్నారు. అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ...‘‘ నా నెల జీతం అన్నా క్యాంటీన్ల నిర్వహణకు విరాళంగా ఇస్తున్నాను. తొలి విడతలో విజయనగరంలోని రెండు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నాం. మలి విడతలో మరిన్ని అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తాం’’అని మంత్రి తెలిపారు. ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌కు వచ్చే అర్జీదారుల కోసం అన్నా క్యాంటీన్ నడిపే ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com