ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 15, 2024, 04:45 PM

శ్రీకాకుళం జిల్లా, సింగుపురం వద్ద జాతీయ రహదారిపె ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను వెనుక నుంచి వస్తున్న ఓ ట్రావెల్‌ బస్సు ఢీకొన్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. రిమ్స్‌ ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫరీద్‌పేటకు చెందిన సత్తారు నాగరాజు తన భార్య జ్యోతితో ద్విచక్ర వాహనంపై పలాస వెళ్తున్నాడు. సింగుపురం వచ్చేసరికి అదే మార్గంలో వస్తున్న ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది. దీంతో నాగరాజు, అతడి భార్య జ్యోతి రోడ్డుపై పడిపోగా బండి బస్సు కిందకు వెళ్లిపోయింది. గాయపడిన భార్యాభర్తలిద్దరికి తెలివి లేకపోవడంతో ద్విచక్రవాహనాన్ని పక్కకు నెట్టి వెళ్లిపోయాడు. ఇది గమనించిన ప్రయాణికులు క్షతగాత్రులను లేపి బస్సును ఆపేందుకు ప్రయత్నించగా ఆపకుండా వెళ్లిపోయాడు. కాగా క్షతగాత్రులను 108 వాహనంలో రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ఇదిలా ఉండగా జ్యోతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆమెను జెమ్స్‌కు తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులకు నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ వాసునారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com