ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసారి దులీప్ ట్రోఫీకి బరిలో దిగనున్న కోహ్లీ, హిట్‌మ్యాన్‌లు....

sports |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 10:01 PM

భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ ఇక టెస్టు క్రికెట్‌పై దృష్టి పెట్టనున్నారు. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌లో కోల్పోయిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం ఇద్దరూ సన్నద్ధమవుతున్నారు. స్వదేశంలో జరుగనున్న ఈ సిరీస్‌లో సత్తా చాటేందుకు ఇద్దరూ దేశవాళీ దులీప్ ట్రోఫీ లో ఆడనున్నారు. ఈసారి దులీప్ ట్రోఫీలో కోహ్లీ, హిట్‌మ్యాన్‌లు బరిలోకి దిగనున్నారు. బీసీసీఐ రూల్స్ ప్రకారం టెస్టు జట్టుకి ఎంపికవ్వాలంటే ఆటగాళ్లు ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే. అందుకని దులీప్ ట్రోఫీకి అందుబాటులో ఉండాలని సీనియర్ ఆటగాళ్లను బీసీసీఐ కోరింది. దాంతో రోహిత్, కోహ్లీలు ఈ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధపడుతున్నారు.


రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్, రవీంద్రజడేజా, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, షాబాజ్ అహ్మద్ ఇలా జాతీయ జట్టు తరఫున ఆడుతున్న స్టార్ ప్లేయర్లందరూ అనంతపురంలో ప్రత్యక్షం కాబోతోన్నారు. ఫ్యాన్స్‌ను ఆలరించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ జరుగనుంది. అదే నెల 22వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే దాదాపుగా మూడు వారాల పాటు జాతీయ జట్టు క్రికెటర్లు అనంతపురంలో మకాం ఉండబోతోన్నారు. దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ ఆడబోయే జట్లన్నీ ఇక్కడికి రానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com