ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులలో దేశభక్తి ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 04:09 PM

మదనపల్లె పట్టణంలో ఈనెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్న ముందస్తు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిం చాలని ఎమ్మెల్యే షాజహానబాషా డీఎస్పీ కొండయ్యనాయుడుకు సూచించారు. ఆదివారం స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమవారం ఉదయం పట్ట ణంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు(ఇంటర్‌, డిగ్రీ) విద్యార్థులందరిని స్థానిక జడ్పీ హైస్కూల్‌లో సమీకరించి అక్కడి నుంచి దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ ర్యాలీ స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌ మీదుగా అనిబిసెంట్‌ సర్కిల్‌ వద్దకు చేరుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ట్రాఫిక్‌ను మళ్లించాలన్నారు. ప్రజలు కూడాపెద్దసంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, ఎంఈవో ప్రభాకర్‌రెడ్డి, ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు ఆర్‌.గురుప్రసాద్‌, ఎన. సేతు, రఘునాథరెడ్డి, శ్రీనివాసులు, పట్టణ ప్రముఖులు మార్పురి శశిధర్‌రావు, మార్పురి వరుణ్‌, ఆర్యవైశ్యసం ఘం అధ్యక్షుడు ఓంప్రకాష్‌, మాకం అశోక్‌, టీడీపీ నాయకులు విద్యాసాగర్‌, నాదెళ్ల శివన్న, షంషీర్‌, నాగూర్‌వలి, బాబాఫకృద్దీన, చిన్నమహేష్‌, జేవీ రమణ, రాయచోటి శశి, సహదేవనాయుడు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com