ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చికిత్సకు మన దేశంలోనే ఔషధమొక్క,,,,షుగర్ వ్యాధి ఉన్నవారికి గుడ్‌న్యూస్

national |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 09:26 PM

డయాబెటిస్ అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. రోజురోజుకూ ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మనం తినే ఆహార అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా ఈ మధుమేహ వ్యాధి సోకడానికి కారణం అవుతోంది. అయితే ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసేందుకు డాక్టర్లు, శాస్త్రవేత్తలు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కొత్త కొత్త మందులు, చికిత్సలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మరోవైపు.. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఆయుర్వేద చికిత్సను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షుగర్ వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషించే ఔషధ మొక్కను మన దేశంలో గుర్తించారు. దానిపేరే గుర్మార్ మొక్క.


బీహార్‌లోని గయాలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు.. అక్కడ అనేకరకాల ఔషధ మొక్కలను గుర్తించారు. అయితే అందులో సైంటిస్ట్‌లకు గుర్మార్‌ అనే ఔషధ మొక్క కూడా కనిపించింది. అయితే మధుమేహాన్ని తగ్గించడంలో ఈ గుర్మార్ మొక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇక మఈ మధుమేహ వ్యాధి చికిత్స కోసం ఉపయోగించే బీజీఆర్‌-34 అనే మందు తయారీకి శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి - సీఎస్‌ఐఆర్‌ పరిశోధకులు ఈ గుర్మార్‌ మొక్కను ఉపయోగిస్తున్నారు. ఈ గుర్మార్ మొక్కలో జిమ్నెమిక్‌ యాసిడ్‌ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇది మనిషి కడుపులో ఉండే పేగులోని పొరపై ఉండే గ్రాహక ప్రదేశాలను నింపేస్తుందని తెలిపారు. దీనివల్ల తియ్యటి పదార్థాలను తినాలన్న కోరికను మనుషుల్లో తగ్గించేస్తుందని పేర్కొన్నారు.


ఇక ఈ గుర్మార్ మొక్కను ఉపయోగించడం వల్ల చివరికి మనిషి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి ఉపయోగపడుతుందని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఇక ఇదే బ్రహ్మయొని పర్వతంపై గుర్మార్ మొక్కతోపాటు పిథెసెలోబియం డుల్సే, జిజుఫస్‌ జుజుబా వంటి ఔషధ మొక్కలు కూడా కనిపించాయి. ఈ మొక్కల్లోని ఔషధ గుణాలపై ఇంకా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇక ఈ బ్రహ్మయొని పర్వతంపై కనిపించిన అత్యంత అరుదైన, విలువైన వనమూలికలు అంతరించిపోకుండా శాస్త్రవేత్తలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ప్రజల సహకారంతో అలాంటి ఆ ఔషధ మొక్కలను సాగు చేయించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వివిధ రకాల చికిత్సల కోసం బీహార్‌లోని గయా ప్రాంతవాసులు ఉపయోగించే మొక్కలను గుర్తించి.. వాటికి సంబంధించిన సమాచారాన్ని భద్రపరచాలని సైంటిస్ట్‌లు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com