ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇది ప్రమాదం కాదు.. యాక్సిడెంట్‌పై దివ్వెల మాధురి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 07:38 PM

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్కలి నుంచి పలాస వెళ్తున్న సమయంలో దివ్వెల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దివ్వెల మాధురికి గాయాలుకాగా.. పలాస ఆస్పత్రికి తరలించారు. వైసీపీ ఎమ్మె్ల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటంబ వివాదంలో దివ్వెల మాధురి పేరు గత రెండు మూడు రోజులుగా ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే టెక్కలి నుంచి పలాస వెళ్తున్న సమయంలో పలాస మండలం లక్ష్మీపురం టో‌ల్ గేట్ వద్ద మాధురి ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో మాధురి స్వయంగా కారును నడుపుతున్నట్లు తెలిసింది.


ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే మాధురిని.. పలాస ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. అయితే మాధురి చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని.. తానే స్వయంగా కారును నడుపుతూ మరో వాహనాన్ని ఢీకొట్టానని చెప్పారు. తనకు చికిత్స కూడా వద్దని వైద్య చికిత్సకు దివ్వెల మాధురి నిరాకరిస్తున్నారు. తన మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందని.. తనతో పాటుగా, తన పిల్లలపైనా ట్రోలింగ్ జరుగుతోందని మాధురి మీడియాతో తెలిపారు. తనకు బతకాలని లేదని.. అందుకే చనిపోవాలనుకున్నట్లు ఆస్పత్రిలో మాధురి మీడియాకు చెప్పారు. డాక్టర్లు కూడా తనకు చికిత్స అందించొద్దని కోరుతున్నారు.


తనపైనా, తన పిల్లలపైనా లేనిపోని ఆరోపణలు, నిందలు వేశారంటున్న దివ్వెల మాధురి.. తాను చనిపోతే అందుకు కారణం దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణియేనని చెప్పారు. వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుందామని హైవే మీదకు వెళ్లినట్లు మాధురి చెప్తున్నారు. మరోవైపు శనివారం మీడియాతో మాట్లాడిన దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్‌ను అతని భార్యాపిల్లలు ఇంటి నుంచి గెంటేశారని చెప్పుకొచ్చారు. దువ్వాడ శ్రీనివాస్, తాను కలిసే ఉంటామని స్పష్టం చేశారు. త్వరలోనే ఇరువురు వేర్వేరుగా విడాకులకు దరఖాస్తు చేస్తామని దివ్వెల మాధురి చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ తన బంధాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని సూచించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com