పార్వతీపురం , సీతంపేట ఐటీడీఏ పీవోలను బదిలీ చేస్తూ.. శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పార్వతీపురం ఐటీడీఏ పీవో సేదు మాధవన్ను విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమించారు. అక్కడ పనిచేస్తున్న జేసీ కార్తిక్ను నెల్లూరుకు బదిలీ చేశారు. సీతంపేట ఐటీడీఏ పీవో రాహుల్కుమార్రెడ్డిని పశ్చిమ గోదావరి జిల్లా జేసీగా నియమించారు. అయితే పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పీవోలను ఇంకా నియమించలేదు. కాగా వారిద్దరూ జిల్లాలో బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే బదిలీ కావడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.