నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో : 3,60,691 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 588 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ సామర్థ్యం : 306.10 టీఎంసీలకు చేరుకుంది. పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు మరింతగా పెరిగింది. 15 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పులిచింతలకు ఎగువ నుంచి 3.12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 12 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించారు. పులిచింతల పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 32.16 టీఎంసీలకు చేరుకుంది.